అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా సత్రం గదులు!

అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా అన్నవరం సత్రం గదులు మారాయి. దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆకస్మిక తనిఖీతో బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బస చేసిన గదుల్లో(రూమ్ నెం: 19, 23) బీర్ బాటిళ్ళు లభించాయి. గత రాత్రి శ్రీసత్యనికేతన్ సత్రంను తనిఖీ చేశారు ఈవో. ఈ వ్యవహరంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఇక మరోవైపు తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ స్వామీజీలు ఆందోళన చేపట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి స్థల కేటాయింపును రద్దు చేయాలని, ఇప్పటికే నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, ముంతాజ్ హోటల్‌ను రద్దు చేయాలని తిరుమల అఖిలాండం వద్ద ఆందోళన చేపట్టగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు అతనిని మరియు ఆయన బృందాన్ని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు.

తిరుపతి సమీపంలోని పేరూరు వద్ద 20 ఎకరాల భూమిని 60 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2022లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే, ఈ భూమి హిందూ ధార్మిక ప్రదేశానికి సమీపంలో ఉండటంతో భక్తులకు అసౌకర్యం కలిగిస్తుందని స్వామిజీలు అభిప్రాయపడుతున్నారు.