గుంటూరు లోని వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 12న జరగనున్న యువత పోరు పోస్టర్ ఆవిష్కరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నారు అంబటి రాంబాబు. వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి… విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.
పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు అన్నారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు.. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం అన్నారు. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అని మండిపడ్డారు.
నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు అన్నారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు… మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు అని మండిపడ్డారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు.. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు రాంబాబు.