అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అధ్యక్ష పదవికి మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా దానిని క్రాస్ చేశారు ట్రంప్. ఈ సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినదించారు ట్రంప్ .
ఈ విజయంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్..తన గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని..అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. అమెరికాకు ఇది స్వర్ణయుగం అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కోసం ఎదురుచూస్తున్నాను అని మోదీ చెప్పారు. ప్రజల అభివృద్ధి, స్థిరత్వం, ప్రపంచ శాంతి కోసం పని చేద్దామంటూ X వేదికగా మోదీ పోస్ట్ చేశారు.