సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసే వారిపై ఏపీ హైకోర్టు కీలక కామెంట్ చేసింది.అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టానికి అనుగుణంగా కేసులు పెడుతుంటే తాము ఎలా నిలువరిస్తామని కామెంట్ చేసింది.
ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం గుర్తు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
కేసులపై ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే జాతీయ ఫోరమ్లలో వైసీపీ ఫిర్యాదు చేస్తోంది. గత వారం రోజుల్లోనే 147 అక్రమ కేసులు పెట్టారని 680 మందికి నోటీసులు జారీ చేసి 49 మందిని అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారని … అక్రమ కేసుల అంశాన్ని ఏపీ డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొంది.