టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ నందిగం సురేశ్కు రిలీఫ్ దక్కింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. 2021లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో నందిగం సురేశ్ కీలక సుత్రధారిగా చేర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును నందిగం సురేశ్ ఆశ్రయించారు. దీంతో బుధవారం పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును శుక్రవారంకు రిజర్వు చేసింది. బెయిల్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేయడంతో.. కేసును విచారించిన న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ పొగించడంతో సురేశ్ ను బందోబస్తు మధ్య గుంటూరు జైలుకు తరలించారు.
అయితే తాజాగా సురేశ్ బెయిల్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.