సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భూమన… ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు.
ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ఇంకా కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని… ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు.
బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ రేపు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని కోరారు.