తెలంగాణ కాంగ్రెస్ను కేబినెట్ విస్తరణ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి పదవులు ఆశీస్తున్న వారి అసంతృప్తి గళం వినిపిస్తుండగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ లెటర్ వైరల్గా మారింది. మంత్రివర్గం రేసులో ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినట్లు కొంతమంది వైరల్ చేశారు.
దీంతో ఈ ఫేక్ లెటర్ను ఎవరు క్రియేట్ చేశారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ఫేక్ లెటర్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్పందించారు.
ఈ లేఖపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఫేక్ లెటర్ తయారు చేశారు అని..వారిపై చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు. ఈ ఫేక్ లెటర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైరల్ చేస్తున్నారని…ఫేక్ లెటర్లు పెట్టినవారిపై చర్యలు తప్పవు అని మల్లు రవి హెచ్చరించారు.