దివంగత నటుడు ,టీడీపీ మాజీ ఎంపీ హరికృష్ఱ కూతురు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్,టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.టీఆర్ఎస్ బలంగా ఉన్న చోట బలమైన ప్రత్యర్థిని నిలపాలని అటు కాంగ్రెస్,ఇటు టీడీపీ పార్టీలు భావిస్తున్నాయి.దీనిలో భాగంగానే హరికృష్ఱ కూతురు సుహాసినీని కూకట్పల్లి నియోజకవర్గ బరిలో నిలపాలని భావిస్తున్నారు.హరికృష్ఱ ఇటీవలే రోడ్డు ప్రమాదంలోమరణించారు.దీంతో ఆయన కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసిన సింపథితో గెలుస్తానరని చంద్రబాబు భావిస్తున్నారని సమచారం.
మొదట కూకట్పల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ఱ పెద్ద కొడుకు కల్యాణ్ రామ్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.అయితే కల్యాణ్ రామ్ ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తిగా లేకపోవడంతో హరికృష్ఱ కూతురిని రంగంలోకి దించారని సమాచారం.దాదాపు సుహాసినీ ఎంపిక ఖారారు అయినట్లు తెలుస్తుంది.గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ మంచి పట్టు ఉండటం,2014 ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గాన్ని టీడీపీ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.మరి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి హరికృష్ణ కూతురు పోటీ చేస్తారా లేదా అన్నది నామినేషన్ వేసే వరకు వేచి చూడాల్సందే.