చంద్రబాబును రోడ్డుపై కూర్చోబెట్టి కొడతారా?

చంద్రబాబు నాయుడు మీద కూడా పాత కేసులు ఉన్నాయి, అతన్ని కూడా రోడ్డుపై కూర్చోబెట్టి కొడతారా అని ప్రశ్నించారు మాజీ సీఎం వైఎస్ జగన్. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడు హరికృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దారుణంగా కొట్టి పడేస్తే ఇవాళ్టికి కూడా నడవలేని స్థితిలో ఉన్నాడు అని ఆగ్రహం వ్యకం చేశారు.

కాని అతనికి ఎలాంటి గాయాలు కాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు అన్నారు. పోలీసులు కొట్టడంతో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్. యువకుల గాయాలకు సంబంధించిన ఫోటోస్, మెడికల్ రిపోర్ట్స్ చూపించి ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్, కరిముల్లా, జాన్ విక్టర్ కుటుంబ సభ్యులు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన సాగుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసులు ఉంటే నడిరోడ్డుపై కొట్టేస్తారా..?, మరి 24 కేసులు ఉన్న చంద్రబాబును కూడా నడిరోడ్డుపై తన్నడం కరెక్టేనా..? చెప్పాలన్నారు. కేసులు తేల్చాల్సింది కోర్టులే కానీ పోలీసులు కాదు అని… పోలీసులకు కొట్టడం, షేమింగ్ చేసే హక్కు లేదు అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయి అని…పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది అన్నారు జగన్. పోలీసుల వ్యవస్థను చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారు…
తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా.. దాని అణగదొక్కేందుకు వైసీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.