Sunday, May 4, 2025
- Advertisement -

ఊరూరా కాంగ్రెస్ పండుగ..

- Advertisement -

నెల రోజుల పాటు ఊరూరా కాంగ్రెస్ పండుగ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్రామ గ్రామాన సంబరాలు .. నెల రోజుల పాటు సంబరాలు చేయాలన్నారు. బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ లపై పెద్దఎత్తున ప్రచారం చేయాలి అన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం జరుగగా ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్ తదితరులు పాల్గొన్నారు.

గత రెండు రోజులుగా అసెంబ్లీలో బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నాం.. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు.. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో కుల ఘనన జరపలేదు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు, ఎస్సి వర్గీకరణ కు ఆమోదం తెలిపాము… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్ లను ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపింది అని చెప్పారు.

ఇప్పుడు మనం చేసుకున్న రెండు తీర్మానాలు సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయి.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మంత్రి వర్గం అంత కృషి చేసి బిల్లులను ఆమోదింప జేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినపుడు ఎంత సంతోషపడ్డమో ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నాము అని చెప్పారు.

ఇంత సంతోషాన్ని పల్లెల్లో ఇంటికి పంచాలి..పెద్ద ఎత్తున సంబరాలు చేయాలి . నెల రోజుల పాటు ఈ సంబరాలు నిర్వహించాలి.. అలాగే ఏఐసీసీ ఆదేశాల మేరకు జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి అన్నారు. ఈ అభియాన్ కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందిస్తాము.. బాణాసంచా కాల్చి, ప్లెక్సీలు పెట్టి, ఇంటింటికి కరపత్రాలు పంచి, ఊర్లలో పండగలాగా సంబరాలు నిర్వహించాలి. స్టేజి మీటింగ్ లు, ప్రెస్ మీట్ లు నిర్వహించాలి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -