తల్లికి వందనం పథకానికి ఎగనామం!

తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. సెంట్రల్‌ జైలులో గంజాయి మొక్కా.. ఇంతకంటే దారుణం ఉంటుందా? అని మండిపడ్డారు. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానని హోంమంత్రి అనిత శపథం చేశారని, ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి సాగు అవుతుందని ధ్వజమెత్తారు.

ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు. . ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉందన్నారు.

గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగావైఫల్యం చెందిందన్నారు. ఇందుకు నిదర్శనమే విశాఖ సెంట్రల్‌ జైలులో గంజాయి మొక్క కనిపించడమేనన్నారు. గంజాయి నిర్మూలనకు కాకుండా ప్రతిపక్షాలని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు అన్నారు. అందుకే దుర్మార్గులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణి.