ఏపీలో బంగారం అమ్మినా ఇసుక దొరకడం లేదన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో మీడియాతో మాట్లాడిన నాని…విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని డబ్బాలు కొట్టి, ఇప్పుడు రూ.6 వేల కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాకినాడలో అక్రమ బియ్యం అంటూ హడావిడి చేశారు ఇప్పుడు ఆ హడావిడి ఏమైందని పేర్ని నాని నిలదీశారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ఐదు నెలల్లో 47 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని అన్నారు. కూటమి పాలనలో నిత్యావసరాల ధరలు బాదుడే బాదుడు …సుప్రీంకోర్టు చెప్పినట్టే చార్జీలు పెంచామని చంద్రబాబు అంటున్నారని, కోర్టు ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అసమర్థత వల్ల విద్యుత్ డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో పేరుకే ఉచిత ఇసుక …అసలు ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా? చెప్పాలన్నారు. గతంకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేట్లని ఇసుక అమ్ముతున్నారని….జగన్ పాలనలో సృష్టించిన సంపదను చంద్రబాబు తన మనుషులకి దోచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.