Saturday, May 3, 2025
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్..హరీశ్‌ రావు మెడకు ఉచ్చు!

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై దూకుడు పెంచగా ఇప్పుడు ఇది హరీశ్‌ రావు మెడకు చుట్టుకుంది. హరీష్ రావు, మాజీ డిసిపి రాధా కిషన్‌రావు కలిసి తన ఫోన్ ట్యాపప్ చేశారని చక్రధర్ రావు ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు 120(B), 386, 409 ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు హరీశ్‌ రావు. రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు.

రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు…సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. ” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -