లడ్డు కల్తీ వివాదం పై సంచలన వ్యాఖ్యలు రోజా రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డు తీసుకోవాలా,తినాలా వద్దా అని అలోచిస్తున్నారు… లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారుఅన్నారు.
ఏపీ తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్నరు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు అన్నారు. సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ అన్నారు. పాపం పవన్ కళ్యాణ్ కి ఏమి తెలియదు ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడమే పని..ట్యాంకర్లు వచ్చింది, శాంపుల్ తీసుకుంది, ల్యాబ్ కు పంపింది, రిపోర్టు వచ్చింది అన్ని చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే అన్నారు.
జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుట్రకు తేరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. చంద్రబాబు నాయుడుకి తప్పు చేశామని తెలిసే సైడ్ అయ్యి పవన్ కళ్యాణ్ ముందర పెట్టి డ్రామాలాడిస్తున్నాడని…చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు భక్తి లేదు బూట్లతో చెప్పులతో దేవుడిని మొక్కుతాడు,పూజలు చేస్తాడు అన్నారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేశాడు… అయినా బుద్ది రాలేదు అన్నారు.
వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చంద్రబాబు చేశాడని…ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అన్నారు. ఒక దొంగ రిపోర్టును తీసుకొని వచ్చి జంతువుల కొవ్వు కలసిందని అబద్ధం చెప్పారు…రిపోర్టును టిడిపి పార్టీ ఆఫీసులో ఎందుకు బయటపెట్టారు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వైరీ మేము అడిగాము… కాని చంద్రబాబు ప్రెస్మీట్లో పెడుతూ డ్రామాలాడుతున్నాడు అన్నారు. ఇప్పటివరకు కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశాడు… ఇప్పుడు మత రాజకీయాలు ప్రారంభించారు అన్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న,అన్న అందరూ దేవుడు లేదండూ దారుణంగా మాట్లాడారు… నా భార్య క్రిస్టియన్ అని చెప్పాడు… ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు..చంద్రబాబు సీఎం అవ్వడానికి అబద్ధపు హామీలు ఇచ్చాడు అన్నారు.
ఈవీఎంలను మేనేజ్ చేసి ఎలా చంద్రబాబు గెలిచాడు అందరికీ తెలుసు అని…ప్రభుత్వం వచ్చినా వంద రోజుల్లో ఇచ్చిన హామీ ఏ ఒకటి నెరవేర్చలేదు అన్నారు. వరదల్లో ప్రజలుంటే కనీసం వారికి నీళ్లు, చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదు అని…వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదాన్ని తెరపైకి చంద్రబాబు తెచ్చాడని..దేవుడి మీద భక్తి భయం ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం మొదట విచారణ జరపాలి.. తప్పు చేసిన వారికి శిక్ష విధించాలన్నారు.
అలా కాకుండా వాళ్ల వంద రోజుల సమావేశంలో ఒక అబద్ధపు ప్రచారాన్ని లడ్డుపై చంద్రబాబు మాట్లాడాడు..దానికోసం ఒక ఫేక్ రిపోర్టును బయటకు తీసుకోవచ్చారు అన్నారు. వనస్పతి మాత్రమే నెయ్యిలో కలిసిందని..అలా నాలుగింటిని మాత్రమే రిజెక్ట్ చేశామని టిటిడి ఈవో అన్నారు… తప్పు జరగలేదని నాలుగు ట్యాంకర్లను రిటర్న్ పంపామని ఈవో తెలిపారు అని గుర్తు చేశారు రోజా.