తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా?,త్వరలోనే ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ వరుసగా భేటీ కావడంతో త్వరలో టీబీజేపీ చీఫ్కు సంబంధించి వార్తలు జోరందుకున్నాయి.
ఇప్పటికే జిల్లాల వారీగా అభిప్రాయసేకరణ చేయగా ప్రధానంగా ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, రామచందర్ రావు, మనోహర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బూత్ కమిటీల ఎంపిక పూర్తి కావడానికి రాగా ఆ తర్వాత మండల, పట్టణ, జిల్లా కమిటీల ఎంపిక పూర్తికానుంది. అనంతరం రాష్ట్రకమిటీ అధ్యక్ష ఎన్నిక ప్రారంభంకానుండగా ప్రతి జిల్లా నుంచి మూడు పేర్లు తీసుకుని, జిల్లా అధ్యక్షుడిగా ఒకరిని ఫైనల్ చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా సంస్థాత నిర్మాణం మొదలు పెట్టింది. అయితే టీబీజేపీ చీఫ్ కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరూ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది.