తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో పదిమంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేదన్న సంగతి తెలిసిందే. కేబినెట్ విస్తరణలో ఎవరెవరికీ అవకాశం దక్కనుందనే దానిపై సస్పెన్స్ వీడిపోయింది.టీఆర్ఎస్ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఏ మంత్రికి ఏ శాఖను కేటాయించారో ఓ సారి చూద్దాం.
జగదీశ్రెడ్డి – రోడ్లు, భవనాలు శాఖ
ఇంద్రకరణ్రెడ్డి – వైద్య, ఆరోగ్య శాఖ
తలసాని శ్రీనివాస్యాదవ్ – పౌరసరఫరాల శాఖ
ఈటల రాజేందర్ – సంక్షేమ శాఖ
నిరంజన్రెడ్డి – ఆర్ధిక శాఖ
కొప్పుల ఈశ్వర్ – విద్యుత్ శాఖ
ఎర్రబెల్లి దయాకర్రావు – వ్యవసాయ శాఖ
శ్రీనివాస్గౌడ్ ఎక్సైజ్ శాఖ
ప్రశాంత్రెడ్డి – పరిశ్రమల శాఖ
మల్లారెడ్డి – విద్యుత్ శాఖ