Tuesday, May 6, 2025
- Advertisement -

చంద్రబాబు సిట్‌ను సుప్రీం రద్దు చేయడం శుభపరిణామం!

- Advertisement -

సుప్రీం కోర్టు వేసిన సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నామని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు…స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.

రాష్ట్రం నుంచి వచ్చే ఇద్దరు అధికారులు చంద్రబాబుకు పనిచేసే అధికారులు కాకుండా చూడాలని, సీనియర్ అధికారులు చాలా మంది ఉన్నారని, వారిని స్వతంత్ర సిట్ దర్యాప్తు బృందంలో వేయాలని కోరారు రాంబాబు. ఇక చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్ని ఉత్తవేనని తేలిపోయాయన్నారు.

భక్తులు తిన్న ప్రసాదం జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు దీనిని నిరూపించలేదన్నారు రాంబాబు. చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న అధికారులతో సిట్ వేశారు…దానిని సుప్రీం రద్దు చేయడం చెంప పెట్టు అన్నారు అంబటి రాంబాబు.

లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. లడ్డూ కల్తీ విషయాన్ని నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేయాలని, ఈ బృందంలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) ఒక అధికారి ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -