వైఎస్ఆర్సీపీ ఏ కూటమిలో లేదని తేల్చిచెప్పారు ఎంపీ విజయసాయి రెడ్డి. మేము మొదటి నుంచి న్యూట్రల్గానే ఉన్నాం…రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని తెలిపారు. కరెంటు చార్జీల పెంపుపై వైయస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన అనంరం మాట్లాడిన విజయసాయి…నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం….వచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందన్నారు. ఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు….సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అన్నారు. నాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయని…జమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడుని అన్నారు. జేపీసీలో ప్రతి రాష్ట్రంలో పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు చేపడతామన్నారు.