దేశంలో అసెంబ్లీకి, పార్లమెంటు ఫలితాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది…అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని తేల్చి చెప్పారు ఆరా మస్తాన్.90 వేల శాంపిల్స్ తో పోస్ట్ పోల్ సర్వే నిర్వమించామని..పార్లమెంట్ స్థానాల్లో కూటమి – వైసీపీ మధ్య స్వల్ప తేడా ఉందన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల మధ్య వ్యత్యాసం పెరిగేదే కానీ, తగ్గేది కాదని…పార్లమెంటు వేరు, అసెంబ్లీ వేరు అన్న భావన దక్షిణాదిలో పెరిగిపోతోందన్నారు.
వైసీపీకి అవసరమైన ఓట్లను ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ చీల్చగలిగింది… అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అలా చేయలేకపోయిందన్నారు. జనసేనకు సీటు ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు ట్రాన్స్ ఫర్ అయింది. టీడీపీకి సీటు ఇచ్చిన దగ్గర జనసేన ఓట్లు పూర్తిగా ట్రాన్స్ ఫర్ కాలేదన్నారు. మైయాక్సిస్ సర్వేలో పొరపాట్లు ఉన్నాయని…తెలంగాణలో బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశముందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రెండోస్థానానికే పరిమితం కానుందని… బీఆర్ఎస్ కు 19 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైందన్నారు.
My Axis సర్వే పొరపాటు పడచ్చు.. YSRCP ఖచ్చితంగా 8 పార్లమెంట్లు గెలుస్తుంది, ఇంకో 6 ఎడ్జ్ YSRCP కే ఉంది. మొత్తం 14 దాకా YSRCP ఎంపీలు గెలుస్తారని తెలిపారు.