ఏడాదిలోనే రూ.1,37,546 కోట్ల అప్పా?

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.3,32,671 కోట్లు అప్పు చేస్తే… చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన 12 నెలల కాలంలోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేసింది అన్నారు మాజీ సీఎం జగన్. వైసీపీ చేసిన అప్పులో.. ఒక్క ఏడాదిలోనే 41 శాతం అప్పు టీడీపీ ప్రభుత్వం చేసింది అన్నారు.

SECI విషయంలో ఈనాడు లాంటి యెల్లో పత్రికల ద్వారా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నాడు అని మండిపడ్డారు జగన్. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచాం… ఆనాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41,170 కోట్లు. చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందికానీ, ఆ టెండర్లను రద్దు చేశారు అన్నారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారు అని ఆరోపించారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు అన్నారు. చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో ఏపీ సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి ? ఎందుకు అంత భూమి ? చెప్పాలన్నారు. నారా లోకేష్ స్నేహితుడి కంపెనీ ఊర్సా అనే సంస్థకు విశాఖపట్టణంలో కేవలం ఒక్క రూపాయికే ఎకరం భూమిని ఇస్తున్నారు… రూ.2000 కోట్లు విలువ చేసే భూమిని ఎలాంటి టెండర్లు లేకుండా లులు మాల్ కు ఉచితంగా కేటాయించారు అని ఆరోపించారు జగన్.