గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. లండన్కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171, 242 మంది ప్రయాణికులతో బయలుదేరే సమయంలోనే ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో ఈ విమానం కూలిపోయింది. అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో 242 మంది ప్రయాణికులతో ఉన్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం జరిగిన వార్త విని తీవ్రంగా కలత చెందానని తెలిపారు.
ప్రయాణికుల కుటుంబ సభ్యులకు, సిబ్బంది కుటుంబాలకు, అలాగే సంఘటనా స్థలంలో ప్రాణనష్టం కలిగిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ధైర్యం కలగాలని, త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విస్తృత విచారణకు ఆదేశించారు.