అక్కినేని నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల త్వరలో ఒక్కటి కాబోతున్నా?, వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇవాళ జరగబోతుందా? సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్గా మారాయి. సమంతతో వివాహం తర్వాత నాగచైతన్య రెండో పెళ్లికి సంబంధించి రోజుకో వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ రూమర్స్కు బలం చేకూర్చేలా నటి శోభితా ధూళిపాళ్లతో చైతూ తిరిగిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరగా ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పుడు ఖండించలేదు. తాజాగా ఇవాళ ఎంగేజ్మెంట్ జరగనుందని తెలుస్తోండగా ఇందుకు సంబంధించి నాగార్జున అఫిషియల్గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ శోభిత ధూళిపాళ్ల. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చారు. 2018లో వచ్చిన గూఢాచారి,2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్రలు పోషించింది. 2021 అక్టోబర్లో సమంతతో విడిపోతున్నట్లు ప్రకటించారు నాగచైతన్య.