Saturday, May 3, 2025
- Advertisement -

మోహన్‌లాల్ – మమ్ముట్టి మల్టీస్టారర్!

- Advertisement -

మాలీవుడ్ లో అదిరే కాంబోలో సినిమా రాబోతుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మోహన్ లాల్ – మమ్ముట్టి కలిసి నటించబోతున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మోహన్ లాల్ జ్యోతి ప్రజ్వలనతో అధికారికంగా ప్రారంభమైంది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తుండగా ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార తదితరులు నటిస్తున్నారు. ఉన్నారు, ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.

శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్‌బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ , కొచ్చితో సహా పలు లొకేషన్‌లలో 150 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. ANN మెగా మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ కథ అందించారు. రాజేష్ కృష్ణ, సి.వి. సారథి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. రాంజీ పనికర్, రాజీవ్ మీనన్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిక్, సనల్ అమన్, రేవతి, దర్శన రాజేంద్రన్, సెరీన్ షిహాబ్, మద్రాస్ కేఫ్, పఠాన్‌ సినిమాలలో అలరించిన ఆర్టిస్ట్-డైరెక్టర్ ప్రకాష్ బెలవాడి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -