స్థానికంగా ఉండే స్ట్రాంగ్ నాయకత్వం తో రాబోయే ఎన్నికల్లో కూడా దాదాపు తమదే గెలుపు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 175 సీట్లు వరకూ 2019 లో తాము గెలుస్తాం అన్నారు ఆయన. తెలుగుదేశం ఖాతా లో ఇంకా ఎక్కువ సీట్ లు కూడా ఊహిస్తున్నారు ఆయన.
ప్రభుత్వ పనితీరు మీద రాష్ట్రం లో ఎనభై మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారు అని ఆయన జోస్యం చెప్పారు. పామర్రు వైకాపా ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పనా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షం లో టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు యాభై సంవత్సరాల పాటు తమ పాలనే ఈ రాష్ట్రం లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.
ఏ నియోజకవర్గంలోనైనా పార్టీ ఓడిపోతే అది స్థానిక నాయకత్వ లోపంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవడం వల్లే నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని, వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.