Sunday, May 4, 2025
- Advertisement -

రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘ఫార్మర్ ఐడీ’

- Advertisement -

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల (ఏఈఓ)కు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం. మే5 అంటే రేపటి నుండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనుంది.

ఈ ప్రాజెక్టు కింద ప్రతీ రైతుకు 11 నెంబర్ల యూనిక్ ఐడీ కేటాయిస్తారు. భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడీలో రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్ బుక్ వివరాలు, భూమి రకం (ఎర్ర నేల, నల్ల నేల, తరి, మెట్ట), సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడీ కార్డు ద్వారా ఒక్క క్లిక్ తో రైతుల వివరాలు తెలుసుకోవచ్చు.

అంతేగాదు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది కంపల్సరీ కానుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ లో అన్ని వివరాలు నమోదుచేస్తారు. అనంతరం రైతులకు ఓటీపీ రానుండగా ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది.దీని ద్వారా పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడీతో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -