Tuesday, May 6, 2025
- Advertisement -

ఇది దారుణమైన విషయం.. నేరం..ఇష్టం లేకపోతే మహశ్ కత్తి చేస్తోన్న ట్వీట్లను చూడకుండా ఉండండి..

- Advertisement -

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తోన్న సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తిపై పవన్ అభిమానులు విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఇష్యూనే సోషియ‌ల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది. అద‌లా ఉంటే పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శలు చేసేవారు లేకపోలేదు. మ‌రో వైపు పూన‌మ్ కౌర్‌ను కూడా లాగ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.

ప‌వ‌న్‌,పూన‌మ్‌, క‌త్తి ఇష్యూపై తాజాగా మానవ హక్కుల నేత బాబు గోగినేని స్పందించారు. మహేశ్ కత్తికి శ్రద్ధాంజలి అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చేస్తున్నారు. నాకు తెలినంతవరకు ఒక బతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం దారుణమైన విషయం.. అంతకన్నా ఎక్కువ ఇదో క్రిమినల్ మేటర్. మహేశ్ కత్తికి, పవన్ కల్యాణ్‌కి ఇద్దరికీ హక్కులు ఉంటాయి.. ఈ జరుగుతోన్న దెబ్బలాటలో ఈ ఇద్దరి వ్యక్తులను కించపరుస్తున్నారు… తమ తమ ఫ్యాన్స్ ఇలా చేస్తోన్న కారణంగా నష్టపోయేది పవన్ కల్యాణ్, మహేశ్ కత్తి మాత్రమే.

విమర్శ చేయడం వేరు.. రాళ్లు వేయడం, బురద చల్లడం వేరు.. మా అభిమాన స్టార్‌ని అందరూ మెచ్చుకోవాల్సిందే అనడం తప్పు.. విమర్శిస్తే చంపేస్తాం అని మాట్లాడుతుండడం తప్పు. కొడతామంటేనే తప్పు.. అటువంటిది చంపేస్తామని కొందరు అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంత సమన్వయం పాటించాలి. ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్ సినిమాలు చూడకూడదు.. ఇష్టం లేకపోతే మహశ్ కత్తి చేస్తోన్న ట్వీట్లను చూడకుండా ఉండండి..” అని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -