- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేయనున్నారు. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలను రెండు రోజుల క్రితమే అక్కడి మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ ఫలితాలను బట్టి ప్రభుత్వ కళాశాలల పనితీరును అంచనా వేసే అవకాశం ఉంది.