మీకు తెలుసా? రాజకీయాల్లో మకుటం లేని మహారాజులుగా వెలుగొందిన వారికి, సీఎంలకు, మంత్రులకు మహానాడు ఒక స్వర్ణ సోపానంలా మారిందని! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నమ్మలేని నిజం. విభజన తర్వాత తెలంగాణకు సీఎంలు అయిన వారందరికీ మహానాడుతో విడదీయరాని బంధం ఉంది. ఎందుకంటే, మహానాడు వేదికపై ఫోటోలకు ఫోజులిచ్చిన వారే, మైకులు పట్టుకుని ప్రసంగాలు దంచిన వారే తెలంగాణకు సారథులు అయ్యారు. ఇది కేవలం యాదృచ్చికం అనుకుంటున్నారా? రాజకీయాల్లో ఏదీ యాదృచ్చికం కాదు!
ఇక మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్ను పరిశీలిస్తే, మెజారిటీ మంత్రులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చినవారే కావడం విశేషం. రేవంత్ రెడ్డి నుండి మొదలు పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలో వారే. ఇది మహానాడు ప్రభావమో, లేదా ఆ పార్టీలో దొరికిన రాజకీయ పాఠాలో తెలియదు కానీ, వారి రాజకీయ జీవితంలో మహానాడు పాత్రను తక్కువ అంచనా వేయలేం.
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అంటారు. కానీ, మహానాడుకు వచ్చి వెళ్లిన వారికి భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద పదవి దక్కుతుందనే ఒక నమ్మకం మాత్రం ప్రచారంలో ఉంది.