క్విడ్ ప్రోకో అంటె ముందుగా గుర్తు కొచ్చేది జగన్. కాకపోతే జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరుగుతున్న అక్రమాస్తుల కేసుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులరైంది. అక్రమాస్తుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి చోటా లీడర్ల వరకు జగన్ను విమర్శిస్తుంటారు. మాకు కావాల్సింది మీరు చెయ్యండి..మీకు కావాల్సింది మేం చేస్తాం’ అనే ఒప్పందమేక్విడ్ ప్రోకో.
జగన్ను పక్కన పెడితే తాజాగా నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబు వైఖరి కూడా క్విడ్ ప్రోకోనే తలపిస్తోందన్నది మాత్రం వాస్తవం. నంద్యాలలో గెలుపు కోసం బాధితులతోనూ, సామాన్య జనాలతోనూ చంద్రబాబు బహిరంగంగానే అనేక రకాల ఒప్పందాలు చేసేసుకుంటున్నారు. ‘మాకు ఓట్లేసి గెలిపించండి..మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలిచ్చేయటాన్ని ఏమంటారో చంద్రబాబు ఆయన పరివారం చెప్పాలి.
డిపికి ఓట్లేయించండి’ బాధితులకు చంద్రబాబు తాయిలాలు. ‘అభివృద్ధి కావాలంటే మాకే ఓట్లేయండి..మేం వేసిన రోడ్లపైన తిరుగుతున్నారు, ఫించన్లు తీసుకుంటున్నారు, రేషన్ తీసుకుంటున్నారు, ఏం టిడిపికి మాత్రం ఓట్లేయరా’? ఓటర్లకు బెదిరింపులు ఇవన్నీ బాబు జిమ్మిక్కులు.
నంద్యాల పర్యటనలో తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన మైనారిటీలను‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ప్రార్ధనే చేస్తారో..కన్విన్స్ చేస్తారో..ఓట్లన్నీ టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికే పడాలి’. ఇది ముస్లిం పెద్దలతో చంద్రబాబు చెప్పిన మాటలు. అంతుకుముందు కేశవరెడ్డి విద్యాసంస్ధ బాధితులు పలువురితో కూడా చంద్రబాబు సమక్షంలోనే టిడిపి నేతలు బేరాలు కుదుర్చుకున్నారని ప్రచారం.
పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ, టిడిపి అభ్యర్ధికి ఓట్లేసి గెలిపించండి, మీక్కావాల్సిన పనులన్నీ చేస్తామంటూ చెప్పటం గమనార్హం. అంటే, టిడిపికి ఓట్లేస్తేనే ప్రభుత్వం పనులు చేస్తుందన్న మాట.ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దౌర్భా గ్యం ఏముంటుంది.
- Advertisement -
నంద్యాల ఓటర్లతో బాబు బహిరంగంగా ఒప్పందాలు….
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -