ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రభుత్వం మొత్తుకుంటున్నా.. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికలు నిర్వహణకే మొగ్గు చూపాడు.
అప్పుడు ప్రభుత్వం కోర్టుకెళ్లినా ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ అంటూ కోర్టులు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహించిన ఎలక్షన్స్ రద్దు చేయాలంటూ కోర్టులు తీర్పు చెప్పడం వివాదంగా మారింది. ఇదిలా ఉంటే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులు తమ హక్కులను కాలరాసాలే ఉన్నాయంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
కృష్ణాజిల్లాకు చెందిన జొన్నల రామ్మోహనరెడ్డి, వేమూరి సురేశ్, భీమవరపు శ్రీలక్ష్మి, మండవ దేదీప్య, బేబీ షాలిని తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాలను కూడా ఈ నెల 27న విచారణకు రానున్న ఎస్ఈసీ అప్పీల్తో జతచేస్తున్నట్లు తెలిపింది.
Also Read: గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?