గుంటూరులోని 42 డివిజన్ టిడిపి అభ్యర్థి బుజ్జిపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. 42 డివిజన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలో పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బుజ్జితో పాటు డివిజన్ టిడిపి అధ్యక్షుడు ఉదయ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావులపై కేసులు నమోదయ్యాయి.
ఈనెల 10న జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 42వ డివిజన్లో వైసిపి నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఆగ్రహించిన వైసీపీ నేతలు టిడిపి నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాహనాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారని వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వైసిపి నేతలపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై టిడిపి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరో బాలిక కేసు.. మత మార్పిడి చేసి మరి ఆ అబ్బాయ్..!
వారెవ్వా..ఈ మహిళ బంగారం ఎక్కడ పెట్టుకుంది చూడండి..!
మోచేతులు, మోకాల్లు నల్లగా ఉన్నాయా.. అయితే ఈ టిప్స్ మీ కోసం !