తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న విశాల్కి ప్రజలకు సేవ చేయడంలో చాలా ఆసక్తి ఉంది. తెలుగులో స్టార్ హీరోలు, ప్రజల కష్టాలు చూసి తల్లడిల్లిపోతారు అని భజన చేయించుకునే హీరోలకంటే విశాల్ చాలా గొప్ప హ్యుమానిటీ ఉన్న స్టార్ అని తెలుగు సినిమా వాళ్ళే మీడియాతో చెప్తూ ఉంటారు. పాలిటిక్స్లోకి వచ్చిన తెలుగు హీరోలు కూడా అంతకుముందు ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కుంటున్న చిన్నవాళ్ళను పట్టించుకున్నది లేదు. అయితే విశాల్ మాత్రం తమిళ నాట జూనియర్ ఆర్టిస్ట్స్ నుంచీ చిన్న స్థాయి టెక్నీషియన్స్ వరకూ అందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. ఇక హుధ్ హుధ్తో పాటు చెన్నై వరదల సమయంలోనూ రోజుల పాటు వరుసగా బాధితుల సమక్షంలో ఉండి వాళ్ళకు డబ్బుతో పాటు, సేవ కూడా చేసిన గొప్పదనం విశాల్ది.
ఇప్పుడు రాజకీయాల విషయంలో కూడా అలానే స్పందించాడు విశాల్. ఎప్పుడూ ఏసీ గదుల్లో ఉండే నాయకులను కాదని, నాలుగేళ్ళలో ప్రజల మధ్య ఎక్కువ కాలం ఉండి, ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడికే పట్టం కట్టాలని చెప్పాడు విశాల్. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదని, ప్రజల మధ్య, ప్రజలతో ఉండే విషయంలో నాయకుడిగా జగన్ని నేను ప్రేరణగా తీసుకుంటానని చెప్పాడు విశాల్. గతంలో హీరో సూర్య, మంచు విష్ణులతో పాటు కొంతమంది సినిమా నటులు కూడా జగన్ నాయకత్వాన్ని, స్పందించే లక్షణాలను ప్రశంశించారు. ఇప్పుడు విశాల్ కూడా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండడం కోసం, ప్రజల కోసం నిలబడే జగన్ లక్షణాలను ప్రశంసించాడు. జగన్ లాంటి నాయకులు సమాజానికి కావాలని విశాల్ అభిప్రాయపడ్డాడు.