- Advertisement -
జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహిళలు అనే గౌరవం BRS పార్టీకి లేదు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారు. పబ్లిక్ గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు,రక్షణ లేదు. కేసీఅర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలి అంటాడు.
మహిళలు అంటే ఒక మత్రికి మరదలు తో సమానం అంట. ఒక ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా కొజ్జా అని అంటున్నాడు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు.. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమీషన్ ముందు పెట్టిన వైఎస్ షర్మిల.

వైఎస్ షర్మిల ఇచ్చిన పిర్యాదు పై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ. అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.