Monday, May 5, 2025
- Advertisement -

వైసీపీ వర్గాలు అవుననే అంటున్నాయ్….

- Advertisement -

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీలో క‌నిపిండా ..? అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని డిసైడ్ అయ్యారార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకనే ఆరుమాసాల సుదీర్ఘ పాదయాత్రను జగన్ పెట్టుకున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.

నవంబర్ 2వ తేదీ నుండి ఆరుమాసాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ జరుగుతుంది. ఎలాగూ ముందస్తు ఎన్నికలొస్తాయని రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే వచ్చే ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలోగా ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయి. ముందస్తు ఎన్నికల సన్నాహాల్లో అన్నీ పార్టీలు ముణిగిపోయాయి. అందులో భాగంగానే అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలు కూడా స్పీడ్ పెంచాయి

అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చ ఎటూ లేదు. అధికారపక్షం హోదాలో టిడిపి సభ్యులు జగన్ ను లక్ష్యంగా చేసుకుని అమ్మనాబూతులు తిడుతున్నారు. ఏ అంశంపైన కూడా జగన్ ను నోరెత్తనీయటం లేద‌న్న‌ది తెలిసిందే.

అసెంబ్లీలో టిడిపిపై వైసీపీ సభ్యులు మాటలతో ఎదురుదాడి చేద్దామనుకున్నా వెంటనే సస్పెన్షన్ వేటు వేసేస్తున్నారు. అదికూడా ఏకపక్షంగా. రోజా విషయంలోను, ప్రత్యేకహోదాపై నినాదాలు చేసినందుకు ఏకంగా 18 మందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి వెళ్ళి టిడిపితో మాటలు పడేకంటే, ప్రజాక్షేత్రంలోకే వెళ్ళి తాను చెప్పదలుచుకుంది నేరుగా ప్రజలకే చెబితే ఎలాగుంటుందని చాలా కాలంగా జగన్ యోచించారు.

దీనిపై పార్టీలోని సీనియర్ నేతలతో చర్చించినపుడు వారు కూడా జగన్ ఆలోచనలకే మద్దతు పలికారట. ప్రజలను కలుసుకోవాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గంగా జగన్ నిర్ణయించుకున్నారు. అందుకనే అసెంబ్లీని బాయ్ కాట్ చేసి ఆరుమాసాల పాదయాత్రకు సిద్ధపడ్డారు. సెంబ్లీకి వచ్చి అక్కడే ప్రకటిస్తారా లేక పాదయాత్రలోనే ఎక్కడైనా ప్రకటిస్తానా అన్నదే సస్పెన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -