ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకు పడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడాన్ని ట్విట్టర్ లో ప్రశ్నించారు.
‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్ఎస్ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుంద’ని ఎద్దేవా చేశారు.
తిత్లీ తుపాను సాయం స్వాహా చేసే మోసగాళ్లను కఠినంగా శిక్షిస్తాం అంటూ బాబు నిన్న దిక్కులు పిక్కటిల్లేలా గర్జించాడట. సాయాన్ని అక్రమంగా నొక్కేసిన పచ్చ చొక్కా తమ్ముళ్లు పక్కకు తిరిగి ఫక్కున నవ్వారట. బాబు వార్నింగ్లు, హూంకరింపులు ఉత్తిత్తివే అన్నది వారికి బాగా తెలుసు కాబట్టి.’ అని విజయసాయి రెడ్డి ట్విటర్లో బాబుపై జోకులు పేల్చారు.