ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ప్రక్షాళనపై దృష్టి సారించింది బీసీసీఐ. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ, జడేజా టీ20లకు గుడ్ బై చెప్పారు.
జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టు నుంచి యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబె, ఖలీల్ అహ్మద్,రింకూ సింగ్ ఆటగాళ్లను తప్పించే యోచనలో బీసీసీఐ ఉంది. వీరి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించినట్లు సమాచారం.
యువ ఆటగాళ్లతో జింబాబ్వే పర్యటనకు జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా శనివారం తొలి టీ20 మ్యాచ్ జరనుంది. ఆదివారం రెండో మ్యాచ్, జులై 10, జులై 13, జులై 14వ తేదీల్లో చివరి మూడు టీ20లు జరగనున్నాయి.
భారత జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే.