పొట్టి క్రికెట్ సంగ్రామం ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22న పొట్టి క్రికెట్ సంగ్రామం ప్రారంభంకానుండగా తొలి మ్యాచ్లో ఆర్సీబీతో తలపడనుంది కేకేఆర్. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు ఆ దేశ టీమ్స్లో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా మనదేశంలో ఎంతోమంది రంజి ఆటగాళ్లకు గుర్తింపునిచ్చింది ఐపీఎల్.
ఇలా ఇప్పటివరకు ఎంతోమంది యంగ్ ఆటగాళ్లు సత్తాచాటగా ఈ సీజన్లో కూడా సత్తాచాటేందుకు మరికొంతమంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ముంబై ఇండియన్స్కు చెందిన రాబిన్ మిన్స్. మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 65 లక్షలకు రాబిన్ను దక్కించుకుంది. జార్ఖండ్కు చెందిన ఈ విధ్వంసకర ఆటగాడు, టి20 క్రికెట్లో 181 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. వికెట్ కీపర్ కూడా కావడం విశేషం.
సూర్యాన్ష్ షెడ్జ్ …జసయ్యద్ ముస్తాక్ అలీ కప్ 2024 ఫైనల్లో ముంబైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. మధ్యప్రదేశ్పై 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అతని జట్టు 129/5 వద్ద ఉన్నప్పుడు, షెడ్జ్ 15 బంతుల్లో 36 పరుగులతో ముంబైని విజయం వైపు నడిపించాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఆడనున్నాడు. బెవోన్ జాకబ్స్ ఒక్కడు మాత్రమే విదేశీ యంగ్ ప్లేయర్. ప్రిటోరియాలో జన్మించిన జాకబ్స్ న్యూజిలాండ్ దేశీయ జట్లైన ఆక్లాండ్, కాంటర్బరీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై జట్టు అతన్ని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.
గత సంవత్సరం ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ టీమ్ రూ. 1.1 కోట్లకు దక్కించుకుంది. అండర్ 19 ఆసియా కప్ 2024-25లో ఏడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఇతనే. అతను టోర్నమెంట్లో 5 మ్యాచ్లలో 176 పరుగులు చేశాడు, అత్యధికంగా 76* పరుగులు చేశాడు.
సి ఆండ్రీ సిద్ధార్థ్.. తమిళనాడు జట్టు ఆటగాడు ఎస్ శరత్ అల్లుడైన 18 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్లో (టీఎన్పీఎల్) ఆడాడు కానీ ఇంకా అంతర్జాతీయ టి20 మ్యాచ్లో ఆడలేదు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్న సిద్ధార్థ్ తనదైన ముద్ర వేస్తాడా? లేదా అనేది వేచి చూడాలి.