జట్టులో చోటు కోసం షమీ ఏం చేశాడో తెలుసా?

దాదాపుగా ఏడాది తర్వాత జట్టులో చోటు సంపాదించాడు మహ్మద్ షమీ. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు, ఛాంపియన్స్‌ ట్రోఫీలో చోటు దక్కించుకున్నాడు షమీ. అయితే జట్టులో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించాడు షమీ.

ఉదయం 6 గంటలకు గ్రౌండ్‌కు చేరుకుని శిక్షణ ప్రారంభించాడు. తన సహచరుల కంటే చాలా ముందుగానే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు షమీ. రెండు నెలల పాటు తనకు ఇష్టమైన ఆహారం, బిర్యానీని కూడా తినలేదు.

షమీ పడిన కష్టాన్ని బెంగాల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ శిబ్ శంకర్ పాల్ తెలిపారు. అందరి కంటే ముందుగానే షమీ ప్రాక్టిస్‌కు వచ్చేవాడని మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అతను బౌలింగ్ చేసేవాడని తెలిపాడు.

ఫాస్ట్ బౌలర్లు గాయం నుండి తిరిగి రావడానికి సమయం తీసుకుంటారు కానీ షమీ తిరిగి జట్టులో చోటు కోసం తీవ్రంగా కష్టపడ్డాడని చెప్పారు. ఇది ప్రతి ఆటగాడికి ఉండాల్సిన అంకిత భావం అని తెలిపాడు. చాలా కఠినమైన డైట్‌లో ఉన్నాడని…. అతను రోజుకు ఒకసారి మాత్రమే తినడం నేను చూశాను అని చెప్పారు. అతనికి బిర్యానీ అంటే ఇష్టం, కానీ తిరిగి క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుండి గత రెండు నెలలుగా నేను అతనికి బిర్యానీ ఇవ్వలేదు, తినడం చూడలేదన్నారు.