బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కు కొంత కాలంగా టైమ్ బాలేదు.తీసిన సినిమాలు ప్లాప్ కావడంతో సక్సెస్ రేటు కూడా పడిపోయింది. ఓకే జానుతోపాటు భారీ అంచనాల నడుమ విడుదలైన హసీనా పార్కర్ కూడా ఆమెకు హిట్ను అందించలేకపోయాయి.ప్రస్తుతం శ్రద్ధా ప్రభాస్ సాహో షూటింగ్లో పాల్గొంటుంది.సైనా నెహ్వాల్ బయోపిక్లో హీరోయిన్గా తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం గురించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది.బ్యాడ్మింటన్ నేపథ్యం కావటంతో గత కొన్ని రోజులుగా సైనా, గోపీచంద్ల సమక్షంలో శ్రద్ధా ఆటను సాధన చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆమె ఆటలో పరిపూర్ణత సాధించలేకపోవటంతో ఈ బయోపిక్ యత్నాన్ని దర్శకుడు అమోల్ గుప్తే విరమించుకున్నాడని ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
ఆ వార్తలను చిత్ర యూనిట్ ఖండించినట్లు మరో కథనం వెలువడింది. ఇక మరో కథనం అయితే ఏకంగా శ్రద్ధాను తప్పించి,ఆ స్థానంలో బ్యాడ్మింటన్ ఆటలో ప్రావీణ్యం ఉన్న దీపిక పదుకునేను తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తను ప్రచురించింది. ఏది ఏమైనా మేకర్లు, చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తేనే ఈ పుకార్లపై స్పష్టత వచ్చేది.