Thursday, April 18, 2024
- Advertisement -

పీవీ సింధు కొత్త కోచ్‌పై కేంద్ర మంత్రి ప్ర‌శంస‌ల జ‌ల్లు

- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీలో తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో త‌న కోచ్ పార్క్ తే సంగ్ తో క‌లిసి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును క‌లిసింది. ఈ సంద‌ర్భంగా కోచ్ పార్క్‌పై మంత్రి కిర‌ణ్ రిజిజు ప్రశంసల వర్షం కురిపించారు.

పీవీ సింధు త‌న కోచ్ పార్క్ తే సంగ్ తో క‌లిసి మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు కేంద్ర మంత్రి వారిని సత్కరిచారు. వారితో కొంతసేపు ముచ్చటించిన రిజిజు.. మీ సపోర్ట్ కు కృతజ్ఞతలు అంటూ.. భారత్ లో హీరో అయ్యారని అన్నారు. ప్రతి భారతీయుడికి మీ గురించి తెలిసింది అని ప్రశంసల వర్షం కురిపించారు.

పీవీ సింధు త‌న కోచ్‌తో క‌లిసి త‌న‌ను క‌లిసింద‌ని చెబుతూ రిజిజు ట్వీట్ చేశారు. పీవీ సింధుకు అండ‌గా నిలుస్తోన్న‌ తల్లిదండ్రులు, బ్యాడ్మింటన్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల‌కు కూడా రిజిజు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేడు ప్రధాని మోదీని పీవీ సింధు కలిసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -