ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25% గా కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం 2024 ఫిబ్రవరి 28న నిర్వహించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో తీసుకుంది.
గత సంవత్సరాల్లో EPF వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే… 2021-22: గత 40 ఏళ్లలో కనిష్టమైన 8.1%, 2020-21: స్థిరంగా 8.5%,2019-20: 8.65% నుండి 8.5%కి తగ్గింపు చేశారు. 2017-18: 8.55%,2016-17: 8.65%,2015-16: గరిష్టంగా 8.8%,2013-14 & 2014-15: 8.75%,2012-13: 8.5%,2011-12: 8.25% (ప్రస్తుత రేటుతో సమానం)గా ఉంది.
EPFO ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. దేశంలోని కోట్లాది ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ను EPF, EPS, EDLI వంటి పథకాల ద్వారా నిర్వహిస్తూ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం అందిస్తోంది.