ఎట్టకేలకు ఆర్సీబీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. ఇందులో విశేషం ఏంటంటే కోహ్లీ ధరించిన జెర్సీ నెంబర్ 18…ఐపీఎల్ సీజన్ 18…యాధృచ్చికమే అయినా 18వ సీజన్లో టైటిల్ను గెలుచుకుంది. ఆర్సీబీ విజయం ముంగిట నిలిచిన వేళ కోహ్లీ కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు అభిమానులను ఎమోషన్కు గురిచేశాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. చివరలో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగినా.. ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు తమ తొలి ఐపీఎల్ టైటిల్ని ఆర్సీబీ అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలుపెరగని పోరాటం చేసింది ఆర్సీబీ. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్కి చేరిన టైటిల్ని అందుకోలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఎక్కడా పొరపాట్లు చేయకుండా అనుకున్న టార్గెట్ను ముద్దాడింది.