భార‌త జ‌ట్టుకు బీసీసీఐ భారీ న‌జ‌రానా..

ఆసిస్ గ‌డ్డ‌పై మొద‌టి సారి టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ. 15 లక్షల నజరానాను బీసీసీఐ ప్రకటించింది. రిజర్వ్‌ ఆటగాళ్లకు రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. జట్టు కోచ్‌లకు రూ. 25 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపింది. సపోర్టింగ్ స్టాఫ్‌కు వేతనంతో సమానమైన నజరానా అందజేయనున్నట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ స్పష్టం చేసింది.