విజయవాడలో టీడీపీకీ మరో షాక్ తగిలింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు పార్టీకీ రాజీనామా చేసి ప్యాన్ గూటికి చేరారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ను కలిసి మద్దతు పలికారు. అనంతరం జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
బీసీలకు వైఎస్ జగన్తోనే న్యాయం జరుగుతుందని పార్టీలో చేరిన అనంతరం తెలిపారు. టీడీపీ విధానాలు నచ్చకే పార్టీమారుతున్నట్లు తెలిపారు. బుద్దా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని విమర్శించారు. పాటు టిడిపిలో కీలకంగా వున్న చాలామంది బిసి నేతలు కూడా బిసిలకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి.. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పిస్తారని జగన్ హామీ ఇచ్చారన్నారు. దీంతో కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ టిడిపి కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఉన్నట్టుండి వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరడం బెజవాడలో చర్చనీయాంశంగా మారింది. తన సోదరుడిపై అసంతృప్తితోనే జగన్కు జైకొట్టారనే చర్చ నడుస్తోంది.