- Advertisement -
అనేక వివాదాస్పాదాలు మూట గట్టుకున్న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్స చిత్రం విడులకు ఎట్ట కేలకు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం ఏపీలో తప్ప మిగిలిన అన్ని చోట్ల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్ కూడా తెచ్చకుంది.
ఏపీలో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సినిమాను విడుదల కాకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కోర్టు కూడా సినిమాను ఏపీలో రిలీజ్ చేసేందుకు ఒప్పుకోలేదు. తాజాగా ఎన్నికలు ముగియడంతో సినిమాను ఏపీలో విడుదల చేయడానికి నిర్మాతలకు అనుమతులు లభించాయి. మే 1న చిత్రం విడుదలకానుంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది