- Advertisement -
దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కెరీర్లో ఇది 29వ సినిమా కాగా ఈ సినిమా గురించిన ఏ చిన్న అప్డేట్ అయిన వైరల్గా మారుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ. డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్తో కలిసి సౌతాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ షూటింగ్ లొకేషన్స్ కోసం రాజమౌళి సెర్చ్ చేస్తుండగా ఆ వీడియోని షేర్ చేశారు.
అంతేగాదు ఈ వీడియోలో టక్కరిదొంగ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ ప్రయాణం చేస్తున్నారు రాజమౌళి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.