- Advertisement -
వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. తాజాగా మనమే అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు శర్వా. ఇది ఆయనకు 35వ సినిమా. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా తాజాగా ట్రైలర్ని రిలీజ్ చేశారు. లండన్ లో జరిగే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రాబోతుంగా మీరు ట్రైలర్ చూసేయండి..