Thursday, May 2, 2024
- Advertisement -

లండన్‌లో శర్వా..’మనమే’

- Advertisement -

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మనమే. శర్వాకు ఇది 35వ సినిమా కాగా టైటిల్ గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్‌. యూనిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. లండన్‌లో సరికొత్త కథతో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా హీరో, హీరోయిన్ లైఫ్ లోకి ఒక బాబు వస్తే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ చాలా బాగుండగా బొమ్మ అదుర్స్ అని చెప్పడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -