- Advertisement -
హీరో అఖిల్ డిజైనర్ శ్రియా భూపాల్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే.వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అఖిల్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. శ్రియా మాత్రం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిదింత్ రెడ్డితో ఏప్రిల్ లో శ్రియకు ఎంగేజ్మెంట్ జరిగింది.తాజాగా పెళ్లి వేడుకతో ఈ జంట ఒక్కటైంది.
ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనకు అనిందిత్ కజిన్ కావడంతో మొదటి నుండి ఆమె ఈ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది.ఈ పెళ్లికి నమ్రత, లావణ్య త్రిపాఠి, ప్రగ్యాజైస్వాల్ వంటి తారలు హాజరయ్యారు. అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు.