- Advertisement -
అల్లుడు శీనుతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచియమైయ్యాడు బెల్లకొండ శ్రీనివాస్.ఈ సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు బెల్లకొండ.తాజాగా అతను హీరోగా వచ్చిన సినిమా సాక్ష్యం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలవడంతో,తన తదుపరి సినిమాపై మరింత ఫోకస్ పెట్టాడు బెల్లంకొండ.తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బెల్లకొండ , ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ను తీసుకున్నారు.తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ తీసుకున్నారు చిత్ర యూనిట్.
మెహ్రీన్ ను తీసుకోవడం .. ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కావడం జరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చంద్రబోస్ సాహిత్యం .. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.మెహ్రీన్ ప్రస్తుతం వరుణ్ తేజ్,విజయ్ దేవరకొండలతో సినిమాలు చేస్తుంది.